తొమ్మిదో సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 21న ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సహకారంతో మంత్రిత్వ శాఖ ఎర్రకోటలో నిర్వహిస్తున్న రెండు రోజుల మెగా ఈవెంట్కు ప్రధాని ప్రసంగం ముగింపుగా నిలుస్తుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. 400 మంది సిక్కు సంగీతకారుల ‘షాబాద్ కీర్తన’ తర్వాత రాత్రి 9:30 గంటల సమయంలో ప్రధానమంత్రి సర్వమత శాంతి సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
రెండు కారణాల వల్ల ఎర్రకోటను వేదికగా ఎంచుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. “మొదటది, మొఘల్ పాలకుడు ఔరంగజేబు 1675లో గురు తేజ్ బహదూర్ను ఉరితీయమని ఆదేశాలు ఇచ్చిన ప్రదేశం ఇది. రెండవది, ఎర్రకోట ప్రాకారాల నుంచి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు, కనుక ఇది సర్వమత శాంతి సందేశంతో ప్రజలకు చేరుకోవడానికి అనువైన ప్రదేశం” అని ఒక అధికారి చెప్పారు.
ఈ కార్యక్రమం ప్రారంభంలో లేజర్ లైట్ షో ఉంటుంది. రెండు రోజుల పాటు ఎర్రకోట ఫోర్కోర్ట్లో సిక్కు గురువు జీవితంపై ప్రదర్శన కూడా ఉంటుంది. ఏప్రిల్ 21న, తన ప్రసంగం తర్వాత, పీఎం ఒక పోస్టల్ స్టాంప్, అలాగే సిక్కు గురువుపై స్మారక నాణెం కూడా విడుదల చేస్తారు, దాని తర్వాత లంగర్ (కమ్యూనిటీ కిచెన్) ఉంటుంది.
సోమవారం ఈవెంట్ను ప్రకటిస్తూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “గురు తేజ్ బహదూర్ ధార్మిక విశ్వాసాల స్వేచ్ఛను రక్షించడం ద్వారా మొఘలుల దురాగతాలను ఎదిరించారు. ఆయన సిక్కులు, హిందువుల హక్కుల కోసం పోరాడారు. మతమార్పిడి కోసం మొఘలులచే శారీరకంగా హింసించబడినప్పటికీ, ఆయన తన స్థావరంలో నిలబడి.. తన నమ్మకాన్ని, సిద్ధాంతాన్ని కాకుండా తన ప్రాణాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. కాశ్మీరీ పండిట్ల బలవంతపు సామూహిక మతమార్పిడులకు వ్యతిరేకంగా పోరాడారు, ఇది మొఘల్లను ఉలిక్కిపడేలా చేసింది. చాందినీ చౌక్లోని గురుద్వారా సిస్ గంజ్ సాహిబ్ను మొఘలులు ఆయన తల నరికి చంపిన ప్రదేశంలో నిర్మించగా.. గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్ ను ఆయన దహన సంస్కారాలు జరిపిన స్థలంలో నిర్మించబడిందని మంత్రి తెలిపారు.