ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వచ్చే ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆమెను కలిశారు. ద్రౌపది ముర్ము అధ్యక్ష పదవికి నామినేట్ చేయడాన్ని భారతదేశంలోని అన్ని వర్గాలు మెచ్చుకున్నాయని ప్రధాని మోదీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
“అట్టడుగు సమస్యలపై ఆమెకున్న అవగాహన, భారతదేశ అభివృద్ధికి సంబంధించిన ఆమె దృక్పథం అత్యద్భుతం” అని ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.
https://twitter.com/narendramodi/status/1539894578848813056?s=20&t=T4aihV2ETp_wo0p_OubFKw
అంతకుముందు ద్రౌపది ముర్ము సమాజానికి సేవ చేయడానికి.. పేదలకు సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పీఎం మోదీ ప్రశంసించారు. ఆమె మన దేశానికి గొప్ప అధ్యక్షురాలవుతుందన్న నమ్మకం తనకు ఉందని ప్రధాని మోదీ అన్నారు.