పాకిస్తాన్ ఫ్రెండ్ అయిన తుర్కియాకు బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిక్స్ అయ్యారు. ఇందు కోసం తుర్కియా సరిహద్దుల్లో మంట పెట్టేందుకు రంగంలోకి దిగారు. శత్రువులకి శత్రువు .. మనకు మిత్రుడు అన్న సూత్రాన్ని మోదీ అమలు చేస్తున్నారు. ఈ వ్యూహం గురించి అర్థం చేసుకోవాలి అంటే తుర్కియా చెత్త పనులు తెలుసుకోవాలి.
పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ప్రపంచమంతా పాకిస్తాన్ ను తిట్టిపోసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లయితే అది నాశనానికి దారితీస్తుందని స్పష్టంగా చెప్పాయి. పాకిస్తాన్ చేసిన చెత్త పనికి ,, ఛీ ఛీ అని అంతా ఛీ కొట్టారు. కానీ తుర్కియా మరియు అజర్బైజాన్ దేశాలు మాత్రం .. పాకిస్థాన్ కు సానుకూలంగా మాట్లాడాయి. పాకిస్తాన్ కు అండగా నిలుస్తామని తుర్కియా హామీ కూడా ఇచ్చింది.
తుర్కియా కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశమే ఆదుకోంది. భారీ భూకంపం వచ్చినపుడు,, పెద్ద మనసుతో భారీ విరాళం ఇచ్చినది భారతదేశమే. అటువంటి కృతజ్ఞత కూడా లేకుండా పాకిస్తాన్ తో చేతులు కలిపింది అంటే తుర్కియాను బాగా అర్థం చేసుకోవచ్చు. భారత్ లో కొంత భూభాగాన్ని దొంగచాటుగా కొట్టేసిన ఘనత పాకిస్థాన్ కు దక్కుతుంది. అదే మాదిరిగా తుర్కియా కూడా దాని పక్క దేశం సైఫ్రస్ నుంచి దొంగ చాటుగా కొంత భూభాగాన్ని కొట్టేసింది. అందుకే రెండు దేశాలకు బుద్దులు కూడా మ్యాచ్ అవుతున్నాయి. అప్పటినుంచి తుర్కియా మరియు సైప్రస్ దేశాల మధ్య తీవ్ర శత్రుత్వం నెలకొని ఉంది.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ లో పర్యటన పెట్టుకున్నారు. ఆపరేషన్ సింధూర తర్వాత ప్రధాని మోదీ చేపట్టిన మొదటి పర్యటన ఇదే కావడం విశేషం. భౌగోళికంగా ఆసియా ఖండంలో ఉన్నప్పటికీ సైప్రస్ దేశం.. యూరోపియన్ యూనియన్ లో సభ్య దేశం. పైగా యూరోపియన్ యూనియన్ అధ్యక్ష బాధ్యతలను సైప్రస్ దేశమే చేపడుతుంది. నిజానికి సైప్రస్ దేశము భౌగోళికంగా చిన్న దేశం కానీ వ్యూహాత్మకంగా ఇది కీలకమైన ప్రాంతం. ఐరోపాలోని అగ్రదేశాలతో సైప్రస్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో సైప్రస్ తో స్నేహం కోరుతూ మోడీ అక్కడ అడుగు పెట్టారు.
మోడీ చొరవకు సైప్రస్ దేశం పొంగిపోతోంది. ఆ దేశపు అత్యున్నత పురస్కారంతో మోదీని అక్కడి ప్రభుత్వం సత్కరించింది. సైప్రస్ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్’ని ప్రధాని మోదీ అందుకున్నారు. మన భాషలో చెప్పాలి అంటే సైప్రస్ లో ఇది భారతరత్న అవార్డు అన్నమాట.
తుర్కియా సరిహద్దుల్లో పొగ పెట్టేందుకు భారత్ సైప్రస్ ఏకం అయ్యాయి అన్నది సుస్పష్టం.
ఇందుకోసమే సైప్రస్ తో భారత్ స్నేహం చేస్తోంది అని అర్థం చేసుకోవచ్చు. ఏకకాలంలో పాకిస్తాన్ కు,, తుర్కీయాకు గట్టి సందేశం పంపించినట్లు కూడా అవుతుంది. పాకిస్తాన్ కు ఎవరైనా సహాయం చేసినట్లయితే ఇలాంటి గతే పడుతుందని భారతం పరోక్షంగా సంకేతాలు పంపిస్తోంది.అందుకే నరేంద్ర మోదీ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ ను ఒంటరి చేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.