జనం నాడి తెలుసుకునేందుకు ‘ప్రధాని నరేంద్రమోదీ’ యాప్..
తన పాలన, దేశంలోని పరిస్థితులపై ప్రజలు ఏమనుకుంటున్నారో నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారు. ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో కేంద్రం ఎదుర్కొన్న పరిస్థితులు, రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు సహా…కేంద్రం తీసుకువచ్చిన కీలక చట్టాలు, ధరల పెరుగుదల, అవినీతి సహా అన్ని అంశాలపై జనం మనసులో మామటేంటనేదాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక కీలకమైన యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు ఏడాదిలో ఉన్న నేపథ్యంలో ఆయారాష్ట్రాల ఓటర్లనాడినీ పట్టాలని నిర్ణయించారు. అందుకోసం ప్రత్యేక సర్వే నిర్ణయించారు. అందుకోసమే….’ప్రధాని నరేంద్రమోదీ’ యాప్ ను ఆయన ఆవిష్కరించారు. ‘షేర్ యువర్ ఆప్షన్’ను క్లిక్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చు.