ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల కోసం గడచిన మూడు నెలలుగా వందలాది సభల్లో పాల్గొన్నారు, వేలాది కిలోమీటర్లు ప్రయాణించారు. ఒక్కోసారి అయితే ఒకే రోజు రెండు మూడు రాష్ట్రాలు కూడా చుట్టి వచ్చారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి అధికారం లోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నారు.
విడతల వారీగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్ 1వ తేదీన తుది విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అందుకుగాను ప్రచార సమయం మే నెల 30వ తేదీ సాయంత్రం తో ముగుస్తుంది. ఎన్నికల ప్రచారం చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోమన్నారు అందుకుగాను ధ్యాన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు అంటే 48 గంటల పాటు నిర్విరామంగా ధ్యానం చేసుకోవడానికి వెళ్తున్నారు. ఈ ధ్యానం చేసుకోవడానికి ఆయన కన్యాకుమారిలో వున్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ను ఎంచుకున్నారు. ఈ నెల 31, జూన్ 1వ తారీఖుల్లో మోదీ నిరంతరాయంగా ధ్యానంలో వుండనున్నారు. ధ్యాన మండపంలోనే గడుపుతారు.
అప్పట్లో ఇక్కడే ధ్యానం చేసి… దేశం గురించి స్వామి వివేకానందుడు తీవ్రంగా తపన చెందారు ఆ తర్వాత దేశమంతా పర్యటించి ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అందుచేతనే దీనిని స్వామి వివేకానంద మెమోరియర్ రాక్ అని పిలుస్తారు.
శివుడి కోసం ఎదురు చూస్తూ పార్వతీ దేవి ఒంటి కాలుపై కన్యాకుమారిలోనే ధ్యానం చేసిందని పురాణాలు చెబుతుంటాయి. అలాగే ఆధునిక కాలంలో స్వామి వివేకానందుల వారు కూడా కన్యాకుమారి రాక్ మెమోరిల్కి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. స్వామి వివేకానందుల వారు ఇక్కడే ధ్యానం చేశారు. ఈ ధ్యానం తర్వాతే స్వామి వివేకానందకు తన కర్తవ్యం బోధపడిరది. భారత దేశ నిర్మాణం కోసం ఏం చేయాలో ఇక్కడే ఆయన నిర్ణయించుకున్నారు. వీటన్నింటి ప్రాధాన్యత రీత్యా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ కాషాయం చుట్టుకొని కేదారనాథ్ గుహలో ధ్యానం చేసుకున్నారు.
మొత్తం మీద ప్రధానమంత్రి విశ్రాంతి కోసం ధ్యాన మార్గం ఎంచుకోవడం విశేషం. అధికారం చేపట్టాక దేశం అంతటా యోగా కు ప్రాధాన్యత తీసుకువచ్చారు. అలాగే ఇప్పుడు కూడా యోగా, ధ్యానం కు ప్రాచుర్యం కల్పిస్తున్నారు.