అసోం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని ఓటర్లకు ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తొలి విడత పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో.. ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ.. ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి రావాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేలా చూడాలని విజ్ఙప్తి చేశారు. అసోం, వెస్ట్ బెంగాల్లో నేడే తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
https://twitter.com/narendramodi/status/1375622259797159936
https://twitter.com/narendramodi/status/1375622671606501378
https://twitter.com/narendramodi/status/1375622991711662085