ప్రధాని మోదీ మరోసారి విద్యార్థులతో చర్చించనున్నారు. ఏప్రిల్ 7న పరీక్షాపే చర్చ ద్వారా విద్యార్థుల ముందుకు రానున్నారు. కోవిడ్ -19 దృష్ట్యా విద్యార్థులతో ఆన్ లైన్ ద్వారా ఇంట్రాక్షన్ ఉంటుందని ఫిబ్రవరిలోనే ప్రకటించారు.
సరికొత్త ఫార్మాట్ లో అనేక విస్తృతమైన అంశాలపై సమగ్రమైన, ఆసక్తికరమైన చర్చ చేసుకుందాం… ప్రశ్నలు అడగొచ్చు… ఏప్రిల్ 7 సాయంత్రం 7 గంటలకు పరీక్షా పే చర్చా లో పాల్గొనండి అని ట్వీట్టర్ వేదిగ్గా మారోసారి గుర్తు చేశారు దేశప్రధాని.
పరీక్షాపే చర్చా పేరుతో..వర్చువల్ ఎడిషన్ నిర్వహించుకోబోతున్నాం… ఒత్తిడిలేకుండా పరీక్షలకు వెళదాం.. పరీక్షలు ఎప్పటికీ జీవన్మరణ సమస్య కావద్దంటూ ఇచ్చిన వీడియో సందేశాన్ని ట్వీట్ కు జతచేశారు.. కేవలం విద్యార్థులే కాదు… ఉపాధ్యాయులు, తల్లిదండ్రులూ ఈ పరీక్షాపే చర్చాలో పాల్గొనవచ్చు..
పరీక్షా పే చర్చ ద్వారా విద్యార్థులు ప్రధానితో మాట్లాడవచ్చు. సలహాలు తీసుకోవచ్చు…ప్రశ్నలు అడగవచ్చు. వాటన్నింటికీ ప్రధాని సమాధానాలిస్తారు. పిల్లల్లో పరీక్షలంటే ఉండే ఒత్తిడిని దూరం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. గతంలో పిల్లల కోసమే… ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకం రాశారు మోదీ. అందులో పిల్లలు ఎలా ఒత్తిడిని దూరం చేసుకోవాలి..ఒకమంచి వాతావరణంలో ఎలా పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి అనే అంశాల్ని చిన్నారులకు అర్థమయ్యేరీతిలో వివరించారు. ఇక కార్యక్రమానికి సంబంధించి అంటే పిల్లలు పరీక్షాపే చర్చా కోసం ఎలా నమోదు చేసుకోవాలి అనే వివరాల్ని ఫిబ్రవరిలోనే నమో యాప్ లో ఉంచారు. చాలామంది పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొదటిసారి 2018 ఫిబ్రవరి 16న టాకటోరా స్టేడియంలో పరీక్షా పే చర్చను నిర్విహంచారు ప్రధాని మోదీ.
A new format, several interesting questions on a wide range of subjects and a memorable discussion with our brave #ExamWarriors, parents and teachers.
Watch ‘Pariksha Pe Charcha’ at 7 PM on 7th April…#PPC2021 pic.twitter.com/5CzngCQWwD
— Narendra Modi (@narendramodi) April 5, 2021