మహారాష్ట్రలోని పూణే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్నిప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. 1,850 కిలోల రాగి,తగరం లోహాలతో దీన్ని రూపొందించారు. విగ్రహం ఎత్తు తొమ్మిదిన్నర అడుగులు. చత్రపతి జీవితం అందరికీ ఆదర్శమని మోదీ అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, పూణే మేయర్ మురళీధర్ మోహోల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)