భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలను మనం ఆచరించాలని.. ఆయన స్పూర్తితో శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి అడుగులు వేయాలని సూచించారు. ఆయన జయంతి సందర్భంగా ఆయనకు నమస్కరిస్తున్నానని.. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఆయన తీవ్ర పోరాటం చేశారన్నారు. ఆయన పోరాటం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని.. మోదీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
https://twitter.com/ANI/status/1382144198212677632