బడ్జెట్పై ప్రధాని మోదీ.. అసాధారణ పరిస్థితుల్లో ప్రవేశపెట్టాం..!
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్లో ప్రజారోగ్యంపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. దేశ ప్రజల సంపద,
ఆరోగ్యం ఎంతో వృద్ధి చెందుతుందన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి ఈ రెండు కీలకమన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతూ.. అసాధారణ పరిస్థితుల్లో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టామని.. ఇది
భారత్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుందన్నారు. ఆత్మనిర్భర్ విజన్తో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు మోదీ పేర్కొన్నారు. దేశ ఆర్ధిక ప్రగతితో పాటుగా.. యువతకు కొత్త ఉపాధి
అవకాశాలు, మౌళిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
రైతుల ఆదాయం పెంచే విధంగా..
రైతుల ఆదాయాన్ని మరింత పెంచే విధంగా.. ఈ బడ్జెట్ను రూపొందించామన్నారు. ఇకపై రైతులు అతి సులువుగా రుణాలు తీసుకోవచ్చని.. ఏపీఎంసీ మార్కెట్లను బలోపేతం
చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ మౌళికసాదుపాయాల నిధితో ఇది సాధ్యం అవుతుందని వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామని.. తాము తీసుకున్న
అన్ని నిర్ణయాల్లో గ్రామాలు, రైతులే కేంద్రంగా ఉన్నారని.. దీంతో సంపూర్ణ వికాసం సాధ్యమన్నారు.
బడ్జెట్పై రాజ్నాథ్ ప్రశంసలు
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రయోజనాలకూ
ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
ఇది చారిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పెట్టిన బడ్జెట్ను బీజేపీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తోందని.. దేశ ప్రజల
అంచనాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉందన్నారు. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించే విధంగా దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద,మధ్యతరగతి జీవన ప్రమాణాలను
పెంపొందించేలే ఈ బడ్జెట్ ఉందని బండి సంజయ్ తెలిపారు.