జో బైడెన్తో ప్రధాని మోదీ ముచ్చట్లు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. గత నెలలో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన జో బైడెన్తో తొలిసారిగా ప్రధాని మోదీ ముచ్చటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జో బైడెన్కు మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇరువురు అంగీకరించారు. ద్వైపాక్షిక,వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటుగా.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను పెంపొందించేందుకు ఎదురు చూస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు ఇండో-పసిఫిక్ వెలుపల కూడా శాంతి భద్రతలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రాంతీయ సమస్యలు, భాగస్వామ్య ప్రాధాన్యతలపై జో బైడెన్తో చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.