ఉత్తరప్రదేశ్ లో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ అత్యాధునిక రహదారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఎక్స్ ప్రెస్ వే ప్రారంభోత్సవం అనంతరం సుల్తాన్ పూర్ జిల్లాలోని కర్వార్ ఖేరీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యూపీ, ఆ రాష్ట్ర ప్రజల సత్తాపై ఎవరికైనా సందేహాలుంటే సుల్తాన్ పూర్ రావాలని మోదీ అన్నారు. నాలుగైదేళ్ల క్రితం ఎలాఉంది ఇప్పుడెలాంటి అభివృద్ధి జరిగిందనేది తెలుస్తుందన్నారు. గత పాలకులు పూర్తిగా పూర్వాంచల్ ను నిర్లక్ష్యం చేస్తే యోగీ ప్రభుత్వం మాత్రమే పట్టించుకుందన్నారు. దేశ భద్రత గురించి పట్టించుకోనివారికి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ఉన్న ఎయిర్స్ట్రిప్ గట్టి సందేశం పంపుతుందని చెప్పారు.అత్యవసర సమయాల్లో భారత వాయుసేన విమానాలు ఇక్కడ దిగేలా… 3.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓ వైమానిక స్థావరాన్ని ఇక్కడ నిర్మించారు.