ఈ ఏడాది కూడా సరిహద్దులో సైనికవీరులతో దీపావళి వేడుక చేసుకున్నారు భారత ప్రధాని మోదీ.
ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో జమ్మూకు చేరుకున్న ఆయన అక్కడినుంచి రాజౌరీ జిల్లా నౌషెరా సరిహద్దు రేఖ దగ్గరకు వెళ్లారు. అక్కడే ఆర్మీసిబ్బందితో కలిసి పండుగ చేసుకున్నారు. ఆ సమయంలో తాను కూడా ఆర్మీ దుస్తులు ధరించి ఉన్నారు. ఆర్మీ యూనిఫాంతోమే…అక్కడి ఔట్ పోస్టులను సందర్శించారు.
2014లో ప్రధాని అయింది మొదలు ప్రతీఏటా దీపావళి వేడుకను సరిహద్దుల్లోకి వెళ్లి సైనికులతో జరుపుకుంటున్నారు. యూరప్ దేశాల్లో 5 రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన కొన్ని గంటలకే ఆయన సరిహద్దును సందర్శించారు.