భారత రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18 పోలింగ్ జరగనుంది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. జూలై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంది.ఇక ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది.నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2.జూలై 18 న పోలింగ్ ఉంటుంది. జూలై 21న కౌంటింగ్ .
రాజ్యాంగం ప్రకారం దేశ ప్రథమ పౌరుడిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుటుంది. ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. బ్యాలెడ్ విధానంలో జరిగే ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. రిట్నరింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు.
ఎంపీ ఓటు విలువ 700 ఉండగా.. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి.
https://twitter.com/ani_digital/status/1534848469114187779?s=20&t=w6Xj8lGxBEWJhIT0aDDTQw