కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. అందులోని అధికారులు, నావికాబృందంతో మాట్లాడారు. భారత్ ఆత్మనిర్భర్ దిశగా ముందుకు సాగుతోంది అనడానికి ఇదే నిదర్శనమని ఆమె అన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ లో భాగస్వామ్యం అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ను, నావికాదళం సిబ్బందిని ఆమె అభినందించారు. దేశ తీరప్రాంతాన్ని పరిరక్షించడంలో విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.