భారతరాష్ట్రపతి ద్రౌపదిముర్ము సుఖోయ్ యుద్ధవిమానంలో ప్రయాణించనున్నారు. ఏప్రిల్ 6,7,8 తేదీల్లో అసోంలో ఆమె పర్యటించనున్నారు. అందులో భాగంగా 8వతేదీన తేజ్ పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆమె సుఖోయ్ -30MKI విమానం ఎక్కుతారని అధికారవర్గాలు తెలిపాయి. మూడు రోజుల అసోం పర్యటన లో ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈనెల 7న కజిరంగా నేషనల్ పార్క్ లో జరిగే గజోత్సవ్ -2023 వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. గువాహటిలో జరిగే మౌంట్ కాంచనగంగ సాహసయాత్ర-2023ని ముర్ము ప్రారంభిస్తారు. అంతేకాదు గువాహటిలో హైకోర్టు ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు..