నల్లగొండ జిల్లా బీబీ నగర్ మండలం మహదేవ్ పూర్ లో నిర్మించిన బ్రహ్మకుమారీస్ రిట్రీట్ సెంటర్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. రాజస్తాన్ లోని మౌంట్ అబూ నుంచి వర్చువల్ గా దాన్ని ఆవిష్కరించారు ముర్ము. గవర్నర్ తమిళిసై సహా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.