NYCI వారిచే భారతీయ నారీ అవార్డుల ప్రధానం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిష్టిత మహిళలకు అవార్డులను అందజేశారు. సమాజసేవ కోసం పాటుపడుతున్న మహిళలతో పాటుగా… స్వయం శక్తితో వ్యవస్థాపకులుగా మారిన పలువురుని గుర్తించి నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు భారతీయ నారీ అవార్డులను ప్రధానం చేయడం జరిగింది. స్వశక్తితో ఎదిగిన వారిని.. మరింత ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు బ్రైన్ ఒ విజన్ సీఈవో D.గణేష్ నాగు గారు తెలిపారు. భారతీయ నారీ అవార్డు గ్రహీతగా 50మంది ఎంపిక కాగా వారిలో హైద్రాబాద్ తెలంగాణ నుంచి మై ఇండ్ మీడియా సీఈవో దేవికా రెడ్డితో పాటుగా.. కల్పనా రమేష్, కవితా నటరాజన్, ఇందిరా ఇరేని, నిహరిక రెడ్డి, లావణ్య గుడెల్లి, జ్యోతి పటేల్, అను ప్రసాద్, హిమజ సి.హెచ్, రాధిక కటారు, వాని ధులపల్లి, శైలజ శంకర్ దేవరకొండ ఎంపికయ్యారని పత్రికా ప్రకటనలో తెలిపారు.