ఆరునెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రావొచ్చన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్. బీజేపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ సభ్యులు కూడా ముఖ్యమన్న సంజయ్…ప్రధాని మోదీ సైతం బూత్ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తుచేశారు. శనివారం నిర్వహించిన పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై మండిపడ్డా సంజయ్.. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని…రాజీనామా పత్రంతో కేసీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. స్మార్ట్ సిటీ, ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ, హరిత హారం కింద కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ సర్కారు దారి మళ్ళిస్తోందని ఆరోపించారు.