కరోనాతో భీకరయుద్ధమే చేస్తున్న భారత్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు టిబెట్ ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధగురువుదలైలామా. భారత పీఎం కేర్ ఫండ్ కు విరాళం ఇవ్వాల్సిందిగా దలైలామా ట్రస్టు ను కోరినట్టు ఆయన తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ప్రత్యేకించి ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవల్ని ఆయన కొనియాడారు. మహమ్మారి పీడ త్వరలోనే విరగడ కావాలని ప్రార్థన చేస్తున్నట్టు తెలిపారు.