అమెరికా పర్యటనకు వెళ్తూ మోదీ ట్వీట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.బయటకూడా దానిమీదే చర్చ నడుస్తోంది.
బోయింగ్ విమానంలో అమెరికాకు పయనిస్తూ తన పర్యటనకు సంబంధించిన కాగితాలు తిరగేస్తున్న ఫొటో అది.
‘సుదూర ప్రయాణమంటే అందుకు సంబంధించిన కాగితాలను తిరగేసే అవకాశం కూడా’ అంటూ ఫొటోను జతచేస్తూ ట్వీట్ చేశారు మోదీ.
ట్వీట్ ని లైక్ చేస్తూ…రీట్వీట్ చేస్తూ క్షణాల్లో లక్షలమంది స్పందించారు. ఆ పార్టీ నేత కపిల్ మిశ్రా మోదీ ఫొటోకు ..మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఫొటోతో కలిపి ట్వీట్ చేశారు. ఒక్కక్షణం కూడా విరామం ఎరుగక పనిచేస్తున్న నాయకుడు మోదీ అంటూ బీజేపీ నాయకులు, మోదీ అభిమానులు వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు..ఇక విమానంలో వెళ్తూ సమోసా తింటున్న రాహుల్ ఫొటోనూ, మోదీఫొటోతో కలిపి పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు మరికొందరు.