
బిజెన్ హోసిని (సిఎన్ఎన్ స్పోర్ట్స్ కరెస్పాండంట్)
ఇతను దుబాయ్ లో పనిచేస్తున్నాడు. అతని చెల్లెలు ఉక్రెయిన్ లో చిక్కుకు పోయింది.
ఆమె ఎలా బయట పడిందో అతను తెలియచేస్తున్నాడు. చదవండి. అక్కడ ప్రజలు, విదేశీయులు పడుతున్న కష్టాలు తెలుస్తాయి.
అతని మాటల్లోనే….
“నా సోదరి ఉక్రెయిన్లో చిక్కుకుంది. పోలాండ్ చేరుకోవడానికి ఆమె చేసిన సాహస ప్రయాణం గురించిన కధ ఇది. ఆమె తప్పించుకునే సమయంలో ఆమె జాత్యహంకారం, గాయాలు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, మరియు నిద్ర లేమిని అనుభవించింది. అక్కడ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న వందల వేల మందిలో ఆమె కథ ఒకటి మాత్రమే.

మా కుటుంబం నా సోదరిని దత్తత తీసుకున్నారు. ఆమె సియెర్రా లియోన్కు (పశ్చిమ ఆఫ్రికా దేశం లో ఒక నగరం) చెందినది. ఆమె ఉక్రెయిన్ నుండి బయట పడడానికి ఆలస్యం కావడానికి ఆమె జన్మస్థలం(అంటే ఆఫ్రికన్ జాతీయత) ముఖ్యమైన పాత్ర పోషించింది.
యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆమె కైవ్లో ఉంది. ఆమె, ఆమెతో ఉన్నవారు అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. కైవ్ నుండి ఎల్వివ్ (పశ్చిమ ఉక్రెయిన్లోని పోలాండ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న నగరం) వరకు ఉన్న రోడ్లపై కార్లు నిలిచిపోయాయి.
వారు డ్నిప్రో (రష్యా సరిహద్దుకు సమీపంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్లోని ఒక నగరం)కి తీసుకెళ్లగలనని చెప్పిన ఒక డ్రైవర్ను పట్టుకున్నారు. అక్కడి నుండి ఎల్వివ్కి బస్సు లేదా రైలు లభిస్తుందని వారు ఆశించారు. ఆ 7 గంటల ప్రయాణానికి డ్రైవర్ వారి దగ్గర $700 వసూలు చేశాడు.
వారు డ్నిప్రోకి చేరుకున్న తర్వాత, అక్కడ బస్సు మరియు రైళ్లు నడవకపోవడాన్ని గమనించిన వారు తమను ఎల్వివ్కు తీసుకెళ్లమని ఆ డ్రైవర్ను వేడుకున్నారు. అతను అదనంగా $1,500 చార్జీ కి అంగీకరించాడు.
వారిని ఒక చిన్న సెడాన్ కార్లో కుక్కేశారు. వారిలో 13 నెలల పాప సహా 8 మంది ఉన్నారు. తిరిగి పశ్చిమ వైపు వెళ్ళడానికి వారి 15 గంటల ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు.
ఎల్వివ్ చేరుకున్న తర్వాత వారిని సరిహద్దుకు కూడా చేర్చేందుకు తాను సిద్దం అని డ్రైవర్ చెప్పాడు. కానీ రోడ్డు మీద 30 గంటల ప్రయాణం తర్వాత అతను కైవ్కు తిరిగి వెళ్లవలసి ఉందని చెప్పాడు. దాంతో నా సోదరి మరియు ఆమె స్నేహితులు కారును వదిలి కాలినడకన సరిహద్దుకు చేరుకోవడానికి ప్రయత్నించారు.

సరిహద్దుకు రాగానే వారిని లోపలికి రానివ్వలేదు.రెండు లైన్లు ఏర్పడ్డాయి. ఒకటి తెల్లవారి కోసం, మరొకటి మిగతా కోసం. కేవలం ఉక్రేనియన్లు మాత్రమే సరిహద్దు మీదుగా అనుమతించబడ్డారు. వేలాది మంది చలికి ఆరుబయటే నిద్రించాల్సి వచ్చింది. ప్రజలను వెచ్చగా ఉంచేందుకు మంటలు వేశారు.
మరుసటి రోజు ఉదయం నా సోదరి స్పృహతప్పి పడిపోయింది. ఆమె అంత నడక వల్ల అలసిపోయింది మరియు చాలా రోజులుగా సరైన నిద్ర, ఆహారం పొందలేదు. ఒక అంబులెన్స్ ఆమెను బోర్డర్ వద్ద ఎక్కించుకుని తూర్పు వైపు 4 మైళ్లు వెనక్కి తీసుకువెళ్లింది. ఆమెకు ఫ్లూయిడ్స్ ఇచ్చిన తరువాత అక్కడే చివరకు విశ్రాంతి దొరికింది.
ఆసుపత్రి నుండి బయలుదేరిన తర్వాత, వారు ఎల్వివ్కి తిరిగి ప్రయాణించారు – బస్ టి కాలినడకన దాటడం ఆ నీరస పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టి బస్సులో ప్రయాణం అనుకున్నారు. ఎల్వివ్ నుండి ప్రెజెమిస్ల్, పోలాండ్కు సాధారణంగా 2:30 గం. ల బస్సు ప్రయాణం ఆ సరిహద్దుకు చేరుకోవడానికి 24 గంటలు పట్టింది.
బస్సు చివరకు సరిహద్దుకు చేరుకున్న తర్వాత (రెండు రోజుల ముందు ఆమె అదే సరిహద్దులో ఉంది) “నల్లజాతీయులందరూ” దిగాల్సిన అవసరం ఉందని ఒకరు ప్రకటించారు. నా సోదరి మరియు ఆమె స్నేహితులు, ధైర్యంగా బస్సు దిగడానికి నిరాకరించారు.
దేశవ్యాప్తంగా సరిహద్దులు, బస్ మరియు రైలు స్టేషన్లలో వేలాది మంది ఇతరులు నివేదించిన ప్రకారం అదే జాత్యహంకార వివక్ష ను వారు కూడా ఎదుర్కొన్నారు.
సరిహద్దు వద్ద ఐదు గంటల పాటు నిరీక్షణ తర్వాత, చివరకు వారిని పోలాండ్ లోకి అనుమతించారు – వారి నాలుగున్నర రోజుల ప్రయాణాన్ని అలా ముగించారు (108 గంటలు).
చదివారు కదా! అటువంటి పరిస్థితుల్లో అసలు భారత ప్రభుత్వం ఏం చేయగలదు? ఉక్రెయిన్ నుండి బోర్డర్స్ కి వెళ్లే అన్ని రోడ్లు వేల వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయిపోతున్నాయి. అయినా ఏ దేశం చేయని విధంగా మన ప్రభుత్వం మన దేశ పౌరులకు సహాయపడడానికి వారి పరిస్థితులు మానిటర్ చేయడానికి నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ బోర్డర్ దేశాలు అయిన హంగేరీ, రుమేనియా, పోలాండ్ మరియు స్లోవాక్ పంపించారు. బోర్డర్స్ దాటడానికి బోర్డర్స్ వద్ద ఒక్క విదేశీయులు మాత్రమే కాదు లక్షల్లో ఉక్రెయిన్ వాసులు కూడా వేచిచూస్తున్నారు.
వాళ్ళందరిని తప్పించి భారతీయులను ఒక్కరిని మాత్రమే బోర్డర్లు దాటించడం ప్రాక్టీకల్ గా ఎంత కష్టమో ఆలోచించండి. ఏ ప్రపంచ దేశం కూడా తమ పౌరులను వెనక్కి తేవడానికి ఇంత సిన్సియర్ గా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ నెల 15వ తేదీన ఇచ్చిన సూచన పాటించి ఉంటే నేడు ఇంత క్లిష్ట పరిస్థితులను భారతీయులు మరియు భారత ప్రభుత్వం ఎదుర్కొనే అవసరం ఉండక పోవును.
ఈ ఉక్రెయిన్ సంఘటన విదేశాల్లో ఉంటున్న భారతీయులు అందరికి ఒక గుణపాఠం లాగా ఉపయోగపడాలి. ప్రభుత్వం తమకు వచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ని ఆధారం చేసుకుని మనకు సూచనలు చేస్తుంది. అటువంటి సమాచారం మన వద్ద ఉండదు. మనకు సమాచారానికి మీడియా, సోషల్ మీడియా మాత్రమే ఆధారం. అందుకని ఎప్పుడైనా ప్రభుత్వ సూచనలను తప్పక పాటించడం అలవాటు చేసుకోవాలి. 15వ తేదీ సూచన అనుసరించి 20 వ తేదీన వచ్చిన వారు కూడా అక్కడ అంతా పరిస్థితి ప్రశాంతంగా ఉంటే మమ్మల్ని అనవసరంగా వెనక్కి రమ్మనమని సలహా ఇచ్చారు అని ప్రభుత్వాన్ని విమర్శించారు. మరునాడే యుద్ధం మొదలు అయిపోయింది.
….చాడా శాస్త్రి…..