గోవా సీఎం గా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు ప్రమోద్ సావంత్. గోవాలోని డాక్టర్ శ్యమ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియం వేదిగ్గా… గవర్నర్ శ్రీధరన్ పిళ్లై ప్రమోద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు సావంత్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. రెండోసారి ప్రమాణస్వీకారం చేసి ప్రమోద్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. 2019లో ఆయన మొదటిసారి గోవా సిఎంగా బాధ్యతలు చేపట్టారు. గోవాకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడోవ్యక్తి సావంత్. మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ప్రమోద్ సావంత్ స్పీకర్ గా ఉన్నారు. పారికర్ మరణానంతరం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ గెలుపుబాధ్యతను భుజాన వేసుకుని విజయంసాధించారు సావంత్.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)