కరీంనగర్ జిల్లా..
ఇళ్ళందకుంట మండలం బోగంపాడు గ్రామంలో మాజీ మంత్రి, బిజేపి నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ..
“రూ.10లక్షల స్కీమ్ తో దళితుల ఓట్లు బాజాప్తా కొంటం అని బరితెగించి చెబుతుర్రు.
జీహెచఎంసీ ఎన్నికల సమయంలో వరుదల పేరిటా దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పైసలు ఓట్ల కోసం పంచిపెట్టిర్రు.
ప్రభుత్వం పైసలు ఎప్పుడు డైరెక్ట్ చేతికి ఇవ్వదు. చెక్కుల ద్వార ఇస్తుంది.
సాక్షాత్తు రూ.900కోట్లు ప్రభుత్వ పైసలు పంచితే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిర్రు.
మూడు ఏళ్లుగా ఇవ్వని పెన్షన్లు ఇవ్వాల ఎన్నికల కోసం నా బొండిగే పిసికెందుకు 11వేల పై చిలుకు మంజూరు చేసిండు.
దళితులకు 10లక్షలు ఇస్తాడట. పేదరికంలో బ్రతికే ప్రతి ఒక్కరికి ఇవ్వమని నేను అంటున్నా.
చదువుకోని నిరుద్యోగులుగా ఉన్న యువకులకు రూ.3వేలు పెన్షన్ ఇస్తాం అని చెప్పావు.
ప్రభుత్వ డబ్బులతో వేలాది కోట్లు సంపాదించుకొని, సర్పంచ్,ఎంపిటిసి, జెడ్పీ టిసిలకు వెల కట్టే పరిస్థితి వచ్చింది.
కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బుతో నేను తట్టుకోలేక పోవచ్చు. కాని ప్రజల హృదయాల్లో బిడ్డగా నేను ఉన్నా.
నన్ను ప్రజలు తప్పకుండా ఆదరించి, ధర్మాన్ని గెలిపిస్తారని గట్టిగా నమ్ముతున్నా”.