ఉత్తర ప్రదేశ్ లోని మణిపురిలోని పొలంలో పాత రాగి ఆయుధాలు దొరికాయి. ఈ ఆయుధాలు దాదాపు నాలుగు వేల ఏళ్ల నాటివని చెబుతున్నారు. జిల్లాలోని తహసీల్ కురవాలి ప్రాంతంలోని గణేష్పూర్లో రైతు బహదూర్ సింగ్ ఫౌజీ జేసీబీతో పొలంలో మట్టిదిబ్బను చదును చేస్తున్నాడు. ఇంతలో అక్కడ మట్టి కింద రాగి కత్తులు సహా అనేక ఆయుధాలు కనిపించాయి.
రైతు వాటిని బంగారం, వెండితో చేసిన విలువైన వస్తువులుగా పరిగణించి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఈ ఘటనపై స్థానికులకు సమాచారం అందడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న రాగి ఆయుధాలు 4000 ఏళ్ల నాటివని.. ద్వాపర యుగానికి చెందినవని నిపుణులు చెబుతున్నారు. ఆయుధాలన్నీ తుప్పు పట్టాయి.
స్థానిక పోలీసులు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చర్యలు ప్రారంభించి, ఆ స్థలాన్ని సీలు చేశారు. 39 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.