నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ తొమ్మిదేళ్లలో దేశం అన్నిరంగాల్లో ఎలా అభివృద్ధి చెందిందో వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విజయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రి వివరించారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చర్యలు చేపట్టింది. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న జన్ సంపర్క్ అభియాన్ను అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది. శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు కార్యాచరణ రూపొందించుకుంది. ఈ నెల 30 నుంచి జూన్ 30 వరకు నెల పాటు మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది రాష్ట్ర పార్టీ.
मोदी सरकार के 9 वर्ष पूर्ण होने पर आयोजित कार्यक्रम के तहत आज हैदराबाद पहुंचने पर भाजपा जिलाध्यक्ष नरसिम्हा रेड्डी जी व पार्टी के अन्य कार्यकर्ताओं ने परंपरागत तरीके से अपनत्व भरा स्वागत किया।
ह्रदय स्पर्शी स्वागत के लिए आप सबका हार्दिक आभार।#Hyderabad pic.twitter.com/kZvGmDV00I
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) May 29, 2023