ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా వాయిదాపడినట్టు పీఎంవో కార్యాలయం వెల్లడించింది. వందేభారత్ రైలుతో పాటు వివిధ పనులు, ప్రాజెక్టులను ఆయన ప్రారంభించాల్సి ఉంది. 7 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆయన ప్రారంభం చేస్తారని బీజేపీ నేతలు వెల్లడించారు. ఈమేరకు భారీ బహిరంగసభకు రాష్ట్రపార్టీ సన్నాహాలు కూడా చేస్తోంది. ఈమేరకు కిషన్ రెడ్డికిసైతం సమాచారం అందింది. ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని..కొత్త షెడ్యూల్ ను త్వరలోనే తెలుపుతామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ తెలిపారు.