తమిళనాడులో చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో 44వ చెస్ ఒలింపియాడ్ను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ మార్క్యూ ఈవెంట్ను భారత్ మొదటిసారిగా నిర్వహిస్తోంది. మోదీ పర్యటనకు ముందు చెన్నైలో డీఎంకే, బీజేపీ మధ్య పోస్టర్ వార్ చెలరేగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్ లలో ప్రధాని ఫోటో లేకపోవడం స్థానిక బీజేపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. ప్రకటనల్లో ప్రధాని మోదీ ఫోటోను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం స్టాలిన్ ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారని తమిళనాడు బీజేపీ ఆరోపించింది. తమిళనాడు ప్రభుత్వం ఉంచిన అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్పై ప్రధాని మోదీ చిత్రాన్ని అతికించాలని వారు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫోటో మాత్రమే ఉన్న బిల్బోర్డ్లు, బ్యానర్లపై ప్రధాని మోదీ పోస్టర్లను అతికించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిన్న పార్టీ కార్యకర్తలను ఆదేశించింది.
మామల్లపురంలో జరగనున్న 44వ చెస్ ఒలింపియాడ్ జూలై 28న ప్రారంభమై ఆగస్టు 10న ముగుస్తుంది.
ప్రధాని మోదీ ఫోటోను రాష్ట్ర ప్రభుత్వం అతికించిన పోస్టర్ లపై అతికించే వీడియో ఒకటి వైరల్ గా మారింది. తమిళనాడు బీజేపీ స్పోర్ట్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెల్ ప్రెసిడెంట్ అమర్ ప్రసాద్ రెడ్డి హోర్డింగ్లపై ప్రధాని మోదీ ఫోటోగ్రాఫ్లను ఫిక్స్ చశారు. కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి చెస్ ఒలింపియాడ్ నిర్వహించే అవకాశం వచ్చిందని వారు వీడియోలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం చెస్ ఈవెంట్ కోసం ప్రధాని మోదీ ఫోటోను చేర్చకుండా ప్రచారంతో ముందుకు సాగడం పెద్ద తప్పు అని ఆయన ఆరోపించారు. “ఇది డీఎంకే పార్టీ కార్యక్రమం కాదు. ఇది ప్రభుత్వ (స్పాన్సర్డ్) కార్యక్రమం. ప్రధాని ఫోటోను తప్పనిసరిగా ప్రదర్శించాలి” అని ఆయన వీడియో క్లిప్లో పేర్కొన్నారు.
https://twitter.com/amarprasadreddy/status/1552124867876597760?s=20&t=a6uGYBF6a1DqkKqKcEGctw