వ్యవసాయ రుణాల మాఫీ, పాత పెన్షన్ వ్యవస్థలను పునరుద్ధరించడం, ఉచిత హామీలను రాష్ట్రాలు అందించడం ఆందోళన కలిగించే విషయం అని SBI రీసెర్చ్ ఏప్రిల్ 18 నాటి నివేదికలో తెలిపింది. ఇలాంటి చర్యల వల్ల దేశంలో ఆర్ధిక విపత్తు వచ్చే అవకాశముందని SBI వెల్లడించింది. కోవిడ్ కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉచిత పథకాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కేరళ సహా పలు రాష్ట్రాలు తమ ఆదాయంలో 5-19% ఉచిత పథకాలు, రుణమాఫీపై వెచ్చించడం శ్రేయస్కరం కాదని SBI తెలిపింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)