కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలో సహకారం అందిస్తున్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్పై ప్రశంసలు కురిపిస్తూ ధన్యవాదాలు తెలిపారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా. వేగంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పూణెకు చెంది సీరం సంస్థ ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా అభివృద్ధిచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తోంది. ట్వీట్ ద్వారా మోదీకి ,నిర్మలాకు ధన్యవాదాలు తెలిపిన అదర్…వ్యాక్సిన్ ఉత్పత్తికి, పంపిణీకి దోహదపడే విధంగా నిర్ణయాత్మక విధాన మార్పులు చేశారని, వేగంగా ఆర్థిక సహాయం అందజేశారని తెలిపారు.
అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఉత్పత్తి కోసం రూ.4,567 కోట్లు మంజూరు చేసింది. కోవిషీల్డ్ను సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా, దేశీయంగా అభివృద్ధిపరచిన కోవాగ్జిన్ను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక దేశంలో 18ఏళ్ల వయసు పైబడిన వారందరికీ మే 1 నుంచి టీకా వేయాలని సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశం వేదిగ్గా ప్రధాని మోదీ నిర్ణయించారు.