రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముగిసింది. పార్లమెంట్లో ఎంపీలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికార ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 776 మంది ఎంపీలు, 28 రాష్ట్రాలు, శాసన సభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 4,033 మంది ఎమ్మెల్యేలు ఓటువేసేందుకు అర్హులుకాగా..దాదాపు అందరూ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇవాళ్టి పోలింగ్ కు సంబంధించిన ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. వచ్చేనెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నికకోసం పోలింగ్ జరగనుంది.