స్వల్ప ఘటనలు మినహా…కర్నాటకలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. 5 గంటలకు 65.59శాతం పోలింగ్ నమోదైంది.రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఒకేదశలో పోలింగ్ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన బలం 113. ప్రధానంగా అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. జేడీఎస్ కూడా పోటీలో ఉంది.ఇక ఈనెల 13న ఫలితాలు వెలువడనున్నాయి.ఈసారి 80ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటినుంచే ఓటువేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది.