ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాల్యాండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడుగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. మేఘాలయాలోని సోహియాంగ్ లో ఓ అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నిక జరగలేదు. నాగాల్యాండ్ లోని అకులుటో స్థానం ఏకగ్రీవం అయింది. దీంతో రెండు రాష్ట్రాల్లో 59 స్థానాలకు ఎన్నిక జరిగింది. 18 లక్షలున్న నాగా అసెంబ్లీలో 183 మంది అభ్యర్థులు బరిలో ఉండగా…21 లక్షలమంది జనాభా ఉన్న మేఘాలయాలో 369 మంది అభ్యర్థి పోటీలో ఉన్నారు.నాగాలాండ్ లో అధికార నేషనలిస్ట్ డెమొక్రటివ్ ప్రోగ్రెస్ పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మేఘాలయాలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ , టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తోంది.