పాఠశాలలో నమూనా పోలింగ్
వివేకానంద స్కూల్ ఇ/మీ, సోనాల లో
విద్యార్థులకు నమూనా పోలింగ్ నిర్వహించి తద్వారా ఓటింగ్,ఎన్నికల విధానం పై అవగాహన కల్పించడం జరిగింది.విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొన్నారు…
నామినేషన్లు దాఖలు చేయడం,బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేయడం,ఓట్ల లెక్కింపు,ఎన్ని కల్లో గెలుపొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది…
ఓటర్లుగా, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా, పోలీసులుగా,వైద్య సిబ్బందిగా విద్యార్థులు వ్యవహరించారు. దీంతో పాఠశాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు….