ఆర్ఎస్ఎస్-బీజేపీ నేతల వివరాలను ఇస్లామిస్ట్ సంస్థ ఎస్డీపీఐ , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు లీక్ చేసినట్లు అంతర్గత విచారణలో తేలడంతో కరీమన్నూర్ పోలీస్ స్టేషన్ సివిల్ పోలీసాఫీసర్ అనస్ పీకేను సస్పెండ్ చేశారు. అనస్ కు 11 ఏళ్లుగా ఇస్లామిస్ట్ సంస్థతో సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసు రికార్డుల నుంచి మొత్తం సమాచారాన్ని తన స్నేహితులకు షేర్ చేసేవాడని తేలింది.
ముఖ్యంగా ఆర్ఎస్ఎస్-బీజేపీ నేతల వివరాలను ఆయా సంస్థలకు రెగ్యులర్ గా చేరవేస్తున్నాడు అనాస్. ఇడుక్కి జిల్లా తొడుపుజాలో మధుసూదన్ అనే బస్ కండక్టర్ పై దాడి చేసి చంపిన నిందితుల్లో ఒకరి కాంటాక్ట్ లిస్టులో అనాస్ నెంబర్ ఉంది. మధుసూదన్ తన పిల్లలతో వెళ్తుండగా వాహనాన్నిఆపి దాడి చేశారు. మహ్మద్ ప్రవక్త కార్టూన్ ను షేర్ చేసినందుకే ఇస్లామిస్టు గ్రూపులు ఆయన్ని టార్గెట్ చేశారు.
గతంలో కేరళలో పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల హత్యల వెనక ఇస్లామిక్ రాడికల్ సంస్థ ఎస్డీపీఐ హస్తం ఉందని తేలింది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా.