ఆదిలాబాద్ లో రైల్వే వంతెన నిర్మాణంలో అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మాట తప్పిన చైర్మన్ రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటిముందు… బీజేపీ యువనాయకుడు పాయల్ శరత్ ఆధ్వర్యంలో యువకులు బైఠాయించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్లపైకి పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇష్టం వచ్చినట్టు చితకబాదడంతో పలువురికి గాయాలయ్యాయి. గండ్రత్ మహేందర్ అనే యువకుడి చేయి విరగగా..శరత్ తలకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ మరికొందరు పంజాబ్ చౌక్ లో రాస్తారోకో చేశారు. ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటిముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.