సమాజంలో మహమ్మారిగా మారిన గంజాయి డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు చొరవ చూపుతున్నారు. ఇటువంటి భయంకర అలవాట్లకు ఎక్కువగా యువత గురి అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుచేత యువతలో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణ పోలీసు శాఖ నడుము కట్టింది.
తెలంగాణ అంతటా వివిధ ప్రాంతాలలో పోలీసు అధికారులు యువతలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ సబ్ ఇన్ స్పెక్టర్ రాము .. యువతలో చైతన్యం కోసం విస్తారంగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికంగా ఉండే పాఠశాలలు కళాశాలలో సందర్శిస్తూ యువతలో అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్ , గంజాయి వంటి వ్యసనాలకు లోనైనట్లయితే జీవితం ఎలా నాశనం అవుతుంది అనేది ఉదాహరణలతో సహా వివరించి చెబుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని యువతకు సబ్ ఇన్ స్పెక్టర్ రాము హితవు పలుకుతున్నారు.
సబ్ ఇన్ స్పెక్టర్ రాములు మరియు ఆయన బృందం శ్రీనివాస్, రామమూర్తి తదితరులు చేస్తున్న కృషిని స్థానికులు అభినందిస్తున్నారు.