అమ్మవారి ఆలయంలో చోరీకోసం వచ్చిన ఓ దొంగ అక్కడ గోడకున్న కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. కంచిలి మండలం జాడుపూడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం కోసం వచ్చాడు ఓ యువకుడు. అక్కడున్న విలువైన వస్తువులు దొంగలించి బయటపడే క్రమంలో అక్కడ గోడకు ఉన్న కన్నంలో ఇరుక్కుపోయాడు. ఉదయం అతన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లొచ్చి జాగ్రత్తంగా కన్నంనుంచి బయటకు తీసి తీసుకెళ్లిపోయారు. అతన్ని కంచిలికే చెందిన రీస్ పాపారావుగా గుర్తించారు.