జాతీయ భద్రతా సలహాదారు హైదరాబాద్ వచ్చారు. కొన్ని గంటలపాటు ఆయనిక్కడ ఉన్నారు. అయితే ఆయన పర్యటన పూర్తిగా రహస్యంగా సాగింది. ఎందుకు వచ్చారు..ఎక్కడెక్కడ తిరిగారు..ఎవరిని కలిశారనేదానిపై ఎవరిదగ్గరా సమాచారం లేదు. పోలీసు వ్యవస్థకు, నిఘావ్యవస్థకు ఎలాంటి సమాచారం లేకుండా ఏ పనిమీద వచ్చారనేదానిపై చర్చ నడుస్తోంది. డిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన మూడు గంటలపాటు ఓచిన్న కార్లో తిరిగినట్టు చెబుతున్నారు. కొందరు కీలక వ్యక్తులతో ఆయన సమావేశమైనట్టు తెలుస్తున్నా… ఎవరిని కలిశారు..ఏం చర్చించారన్నది ఎవరికీ ఆంతుపట్టడం లేదు.
అయితే జాతీయ భద్రతా సలహాదారు తెలంగాణ రాజధానికి అకస్మాత్తుగా రావడంపై రకరకాల ప్రశ్నలు, ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఇటీవలే కేంద్రం నిషేధించిన పీఎఫ్ఐ మూలూలు హైదరాబాద్ లోనూ ఉన్నాయన్న నేపథ్యంలో జాతీయ భద్రతకు సంబంధించి ఏదన్నా అంతర్గత సమావేశం కోసం వచ్చారా లేక మరెందుకైనానా అనే ప్రశ్నలు అందర్లో.
దోవల్ చివరగాగతేడాది నవంబర్లో హైదరాబాద్ వచ్చారు. జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి మాత్రం ఎలాంటి సమాచారం లేకుండా రహస్యంగా వచ్చి వెళ్లారు.
దేశంలో శక్తిమంతమైన వ్యక్తిగా ఉన్నారు దోవల్. ఆయన ఆధ్వర్యంలో కీలక ఆపరేషన్లు జరిగాయి. భారత అధికారిగా పాకిస్తాన్లో రహస్యంగా పనిచేశారు.. అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులు చొరబడ్డ సమయంలో రిక్షావాలా వేషంలో అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు.