బిపిన్ రావత్ మరణంపై సంతోషం వ్యక్తం చేస్తూ..అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసిన వారి అరెస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా జమ్ము, కశ్మీర్, లద్దాక్, రాజస్థాన్, గుజరాత్, యూపీ పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన కొందరు కూడా ప్రమాదంపై సంతోషం వ్యక్తం చేస్తూ వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నాయి.