ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తన కుటుంబసభ్యులతో కలిసి బండీపురా వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. మైసూరుకు 15 కిలోమీటర్ల దూరంలో కడ్కోల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రహ్లాద్ మోదీ మనవడి కాలు ఫ్రాక్చర్ అయింది. తలకు కూడా గాయాలయ్యాయి. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అందరినీ మైసూరులోని జేఎస్ ఆసుపత్రిలో చేర్చారు.