సాయుధ దళాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తుతున్న వేళ… జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.
“దీన్ని విభిన్న కోణం నుంచి చూడవలసిన అవసరం ఉంది. అగ్నిపథ్ అనేది ఒక స్వతంత్ర పథకం కాదు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశాన్ని ఎలా సురక్షితంగా, పటిష్టంగా మార్చాలనేది ఆయన ప్రాధాన్యతలలో ఒకటి. దానికి అనేక మార్గాలు, దశలు అవసరం, అగ్నిపథ్ అందులో భాగమే” అని ఆయన అన్నారు.
#WATCH LIVE | NSA Ajit Doval speaks to ANI's Smita Prakash on the #AgnipathRecruitmentScheme and other internal security issues https://t.co/DJ87xXO8j9
— ANI (@ANI) June 21, 2022
పరికరాలలో మార్పులు, వ్యవస్థలు-నిర్మాణాలు, సాంకేతికం, మానవ వానరులలో భవిష్యత్ విధానాలు అనే నాలుగు ప్రధాన అంశాలపై ఈ పథకం రూపొందింది.. యుద్ధాలలో కూడా చాలా మార్పు వస్తోంది.. మనం కాంటాక్ట్లెస్ యుద్ధాల వైపు వెళ్తున్నాం. ఇప్పుడు యుద్ధాలు అదృశ్య శత్రువులకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. సాంకేతికత శరవేగంగా ఆక్రమిస్తోంది. మనం రేపటి కోసం సిద్ధం కావాలంటే, ప్రస్తుతం మనం మారాలి. భద్రత అనేది డైనమిక్ కాన్సెప్ట్. అది ఎప్పుడూ ఒకేవిధంగా స్థిరంగా ఉండకూడదు”అని దోవల్ అన్నారు.
అగ్నిపథ్ పథకంపై అల్లర్లు సృష్టిస్తోన్న యువతను ఉద్దేశించి, రక్షణ దళాలలో చేరాలనుకునే ఎవరైనా ఇంట్లోనే సిద్ధమవుతారు. ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టే వారికి స్వార్థ ప్రయోజనాలున్నాయని దోవల్ అన్నారు.