ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా-2023ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.బెంగళూరు శివారు యలహంక ఇందుకు వేదికైంది. నయాభారత్ సామర్థ్యాన్ని చాటే గొప్ప వేదిక ఇదని ఆయన అన్నారు.దాదాపు 100 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. రక్షణ, వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. ‘ ది రన్ వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఐదు రోజులపాటు సాగనుంది. ఈ సందర్భంగా పలు వైమానిక ప్రదర్శనలను మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, కర్నాటక సీఎం బస్వరాజు బొమ్మై తిలకించారు.
https://twitter.com/narendramodi/status/1624988334388023297?s=20&t=5kN5kPKuMJkKsxo4aU-93w