వాటిని ఉచితంగా ఇవ్వండి ప్లీజ్.. మోదీ సాయం కోరిన దీదీ..!
ప్రధాని నరేంద్ర మోదీకి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు చొరవ చూపాలంటూ మోదీని కోరారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కు, ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టామని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బందికి వెంటనే వ్యాక్సిన్లను ఇస్తే ఎన్నికలను సజావుగా నిర్వహించుకోగలుగుతామని దీదీ లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిందని.. ఈ క్రమంలో బెంగాల్ రాష్ట్రానికి తగిన మోతాదులో వ్యాక్సిన్ సరఫరా అయ్యేలా చూడాలని మమతా బెనర్జీ కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రజలందరికీ వ్యాక్సినేషన్ అయ్యేలా చూడాలనేదే తమ లక్ష్యమన్నారు.
కాగా, 294 మంది సభ్యులున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 5.63 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 10 వేల మంది వరకు కరోనా బారినపడి మరణించారు.