ఆదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ కుట్రకు పాల్పడిందని, కుట్రపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచార జరపనుంది. అమెరికాలో ఉన్న హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదిక వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతిందని ఆరోపించారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతోందని … న్యాయవాదులు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అదానీ స్టాక్స్ను హిండెన్బర్గ్ షార్ట్ సెల్ చేసిందని, దీనివల్ల పెట్టుబడిదారులకు భారీ నష్టం వాటిల్లిందని వీరు ఆరోపించారు. ఈ నివేదికపై మీడియా చేసిన రాద్ధాంతం కారణంగా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. హిండెన్బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ తన ఆరోపణలకు ఆధారాలను ఇండియన్ రెగ్యులేటర్స్ – సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి చూపించలేకపోయారని తెలిపారు.
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్రమైన అకౌంటింగ్ మోసాలకు, స్టాక్ మేనిప్యులేషన్కు పాల్పడుతున్నాయని హిండెన్బర్గ్ బయటపెట్టిన నివేదికతో భారత్ లో దుమారం రేగింది. ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ మధ్య సత్సంబంధాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం మంగళవారం ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడారు. అయితే ప్రసంగంలోని భాగాలను రికార్డుల నుంచి తొలగించారు.