అటు రాహుల్ పై అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దోషులుగా తేలిన వెంటనే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ అభా మురళీధరన్ సుప్రీంలో పిల్ వేశారు. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 8(3)కింద దోషిగా తేలిన ఎంపీ లేదా ఎమ్మెల్యే అటోమెటిగ్గా అనర్హుడు అవడం అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమైన అటోమెటిక్ అనర్హతపై తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అంతకుముందు దోషిగా తేలిన తరువాత అనర్హత వేటుకు మూడునెలల సమయం ఇచ్చేవారు. ఆలోపు పై కోర్టులో అప్పీలు చేసుకునే వీలు కలిగేది. అయితే ఆ నిబంధనపై గతంలో సుప్రీంలో సవాల్ చేయగా ధర్మాసనం కొట్టివేసింది.