నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ఖాతానూ కేంద్రం నిలిపేసింది. కేంద్రప్రభుత్వ ఆదేశం మేరకు పీఎఫ్ఐ అధికారిక ఖాతాను నిలిపేసింది ట్విట్టర్. ఉగ్రవాదసంస్థలతో సంబంధం ఉందనే ఆరోపణలపై పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలను ఐదేళ్లపాటు నిషేధం విధిస్తూ రెండు రోజుల క్రితం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్షణం నుంచే నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే సోషల్మీడియా వేదిగ్గా సంస్థ తన కార్యకలాపాలు కొనసాగించవచ్చని భావించిన కేంద్రం వాటిపైనా కన్నేసింది. అందులో భాగంగా ట్విట్టర్ ఖాతాను నిలిపేసింది. పీఎఫ్ఐ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను దాదాపు 80వేల మంది ఫాలో అవుతున్నారు.