తాజాగా నిషేధానికి గురైన పీఎఫ్ఐ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షాహీన్ భాగ్ అల్లర్ల తరహాలో పెద్దఎత్తున హిందూ వ్యతిరేక అల్లర్లకు ఆ సంస్థ కుట్రపన్నినట్టు తేలింది. దేశం మీద యుద్ధాన్ని ప్రకటించిన PFI, అనుబంధ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు, సంస్థలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇతర ఫెడరల్ ఏజెన్సీలు రెండో రౌండ్ అరెస్టులు, దాడుల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. దేశరాజధాని ఢిల్లీతో పాటు..ఇతర రాష్ట్రాల్లో పెద్దఎత్తున అల్లర్లకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తేలింది. షాహీన్ భాగ్ తరహాలో సామూహిక అల్లర్లు, మత ఉద్రిక్తతలకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు.
విస్తృతమైన నెట్వర్క్ ఉన్నట్టు గుర్తించారు. జిల్లా స్థాయిలో పనిచేసే ఇంటెలిజెన్స్ విభాగాలను పీఎఫ్ఐ నిర్మించుకున్నట్టు దర్యాప్తులో తేలింది. అంతేకాదు సంస్థ హిట్ లిస్టులో ఉన్న వ్యక్తుల జాబితాను ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో మొదలైన నిరసనలు ఏ స్థితికి దారితీశాయో తెలిసిందే. షార్జీల్ ఇమామ్ ప్లాన్ చేసి రూపొందించిన షాహీన్ బాగ్ వద్ద ‘CAA వ్యతిరేక నిరసనలు’ పేరుతో కల్లోలం రేపారు. ఢిల్లీ ఎన్నికల వేళ భారత వ్యతిరేక ఎజెండాను ముందుకు తెచ్చి దేశంలో అరాచకం సృష్టించేందుకు ఆల్ట్రా లెఫ్ట్ వింగ్, వేర్పాటువాదులు, ఇస్లామిస్టులు ఏకకాలంలో కలిసి పన్నిన పన్నాగం అది అని దర్యాప్తులో తేలింది.
ఇక సంస్థ బ్యాన్ కు ముందు తొలిదఫా దాడుల్లో అరెస్టైన పీఎఫ్ఐ నేతలను విచారించగా కీలక సమాచారం లభ్యమైనట్టు తెలిసింది. దీంతో NIA, రాష్ట్రాల పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు రెండోరౌండ్ దాడులు నిర్వహించారు.
Shaheen 're-run' averted: TIMES NOW reveals #PFI plot.
SOURCES in Delhi Police suggest that 'PFI was planning major mass unrest in Delhi & several other states'
Listen to these reactions. pic.twitter.com/agOAhhzBFG
— TIMES NOW (@TimesNow) September 27, 2022
సెప్టెంబరు 22న 15 రాష్ట్రాల్లోని ఎన్ఐఏ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు రాష్ట్ర పోలీసులు పిఎఫ్ఐకి సంబంధించిన ప్రదేశాలపై దాడులు చేశారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్, మణిపూర్ రాష్ట్రాల్లోని 93 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. 100 మందికి పైగా PFI నాయకులు, సభ్యులను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి.
ఈ సంస్థకు దేశవ్యాప్తంగా తీవ్రవాద నిధులతో సంబంధం ఉందన్న ఇన్పుట్లు, ఆధారాల ఆధారంగా దాడులు నిర్వహించారు.. PFI ఆయుధ శిక్షణను అందించడానికి శిబిరాలను నిర్వహించింది. తొలి రౌండ్లో పీఎఫ్ఐ చీఫ్ ఓఎంఏ సలాం ఇంటిపై కూడా దాడులు జరిగాయి.
వరుస దాడులతో 15 రాష్ట్రాలలో PFI సభ్యులు నిరసనలు నిర్వహించారు. సంస్థపై ప్రభుత్వం దాడి చేసిందని ఆరోపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పూణెలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో, PFI సభ్యుల ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు వినిపించాయి.