కేంద్రం పెట్రోల్ పై విధించే పన్నులలో మూడు రకాల కంపోనెంట్స్ ఉంటాయి.
అవి..
1. సెంట్రల్ ఎక్సైజ్
2. రోడ్ సెస్
3. ప్రత్యేక ఎక్సైజ్
వీటిల్లో ఎక్సైజ్ పెంచితే దానిలో రాష్ట్రాలకు 42% వాటా మళ్ళీ ఇవ్వాలి. అందుకని కేంద్రం రోడ్ సెస్ పెంచుకుంటోంది. దాని వల్ల ఆ డబ్బులు. పూర్తిగా కేంద్రాని కె చెందుతాయి. అంటే ఉదాహరణగా చెప్పాలి అంటే..
కేంద్రం ₹10 సెస్ పెంచితే.. ఈ 10 పూర్తిగా కేంద్ర ఖజానాకు పోతుంది. రాష్ట్రాలకు వాటా రాదు. కానీ అదే ₹10 కేంద్రం ఎక్సైజ్ పెంచితే దానిలో మళ్ళీ ₹4 రాష్ట్రాలకు ఇవ్వాలి.
ఈ లెక్కలో కూడా రాష్ట్రాలు ఎలా లాభం పొందుతాయో చూడండి.
ఉదాహరణకు సెస్ 10 రూ. పెంచితే కేంద్రానికి 10 రూ. వస్తుంది. కేంద్రం తిట్లు తింటుంది. కారణం మొత్తము ₹10 రూ. ప్రజల మీద భారం వేసి కేంద్రం కొట్టేస్తున్నది అని రాష్ట్రాలు ఆరోపిస్తుంటాయి. సరే ఇది నిజమా? కాదు.
ఎందుకంటే కేంద్రం ₹10 సెస్ వేస్తే రాష్ట్రాలు ఆటోమాటిక్ గా ఆ 10రూ.ల మీద కూడా వాట్ బాదుతున్నారు. ఈ వేట్ 25% నుండి 40%(మహారాష్ట్రలో) వరకు ఉంది. అంటే
కేంద్రం పెంచిన ప్రతీ 10రూ. సెస్ మీద రాష్ట్రాలు మరో 3 నుండి 4 రూ. వడ్డిస్తూ మొత్తం 13 /14రూ.పెంపుకు కేంద్రాన్ని తిడుతున్నాయి.. అంటే మొత్తము వినియోగ దారుడుకి 13.లేక 14 బాదుడు అన్న మాట.
ఇక రెండో కంపోనెంట్ సెంట్రల్ ఎక్సైజ్ చూద్దాం.
ఇది కానీ కేంద్రం 10రూ. పెంచితే దీని.మీద కూడా రాష్ట్రాలు 3లేక 4 రూ. వాట్ అదనంగా సంపాదిస్తారు.
అంటే కేంద్రం 10 పెంచితే వినియోగ దారుడికి పెరిగేది 13 లేక 14 రూ. కానీ ఇక్కడే తేడా ఉంది.
కేంద్రం రోడ్ సెస్ పెంచిన 10+రాష్ట్ర వేట్ 3 కలిపి మొత్తం పెంపు 13 అనుకుంటే..దానిలో కేంద్రం 10, రాష్ట్రాల వాటా 3 రూపాయలు.
అదే కేంద్రాల సెంట్రల్ ఎక్సైజ్ పెంచితే అదే 13 లో వాటా ఇలా ఉంటుంది.
పెంచిన కేంద్ర ఎక్సైజ్ 10 దానిమీద వేట్ 3 = మొత్తం ₹13
ఎక్సైజ్ లో రాష్ట్రానికి వాటా 4 కేంద్ర వాటా 6
అంటే మొత్తం పెంపు 13లో రాష్ట్రానికి దక్కేది కేంద్ర ఎక్సైజ్ 4+వాట్ 3 అంటే మొత్తం 7రూ.
కేంద్రానికి మొత్తం దక్కేది 6 రూపాయలు.
మొత్తము ₹13 పెంపుకు తిట్లు తినేది కేంద్ర ప్రభుత్వం.
Courtesy : Chada Sastry