పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న వేళ ఆ పెరుగుదల తక్కువేనంటున్నారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పెట్రో ధరల పెరుగుదలపై లోక్ సభలో ఆయన వివరణ ఇచ్చారు. “భారతదేశంలో పెరిగిన పెట్రోల్ ధరలు ఇతర దేశాలలో పెరిగిన ధరలతో పోలిస్తే 1/10 వంతు మాత్రమే పెరిగాయి. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 మధ్య పెట్రోల్ ధరలను పోల్చి చూస్తే, యునైటెడ్ స్టేట్స్లో 51%, కెనడా 52%, జర్మనీ 55%, UK 55%, ఫ్రాన్స్ 50%, స్పెయిన్ 58% పెరిగాయి, కానీ భారతదేశంలో 5% మాత్రమే పెరిగాయి” అనిఆయన అన్నారు.
మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 13వ సారి. ప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.9.20 చొప్పున పెరిగాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)